సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఉన్న క్రేజ్, బజ్, డిమాండ్ మేరకు ఫ్యాన్సీ రేటుకే మేకర్స్ అమ్మేశారు. ‘శంబాల’ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్లో అంచనాల్ని పెంచేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే శంబాల మేకింగ్ వీడియో, టీజర్,…
