31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్: శంకర్పల్లి రోడ్లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తాండూరుకు చెందిన ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్ అనుబంధ సంస్థ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నాగ్పూర్లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గనుల చీఫ్ కంట్రోలర్ డా. వై.జి. కాలే, దక్షిణ మండల గనుల కంట్రోలర్ శ్రీ శైలేంద్ర కుమార్, ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) సీఈఓ & నామినేటెడ్ ఓనర్ శ్రీ…
