Skip to content

నాటి చోళ కుందవై… నేడు నటి త్రిష…?

🔸 చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను ఉదహరిస్తూ నటి త్రిష ను విమర్శించిన పార్తీబన్‍ కు పరోక్షంగా గట్టి కౌంటర్‍ ఇచ్చింది త్రిష 👉 వివరాల్లో కి వెళ్ళితే ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గోన్న నటుడు దర్శకుడు పార్తీబన్‍ నటి త్రిష ను ఉద్దేశించి వ్యంగంగా వ్యాఖ్యలు చేసాడు. గత వారం తమిళస్టార్‍ విజయ్‍ తో కలిసి ఓ వివాహ వేడుక కు త్రిష హాజరు అవ్వడాన్ని ఉద్దేశించి “ ఆ కుందావై ( త్రిష ) కొన్నాళ్ళు ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిది అని ఉచిత సలహా ఇచ్చాడు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో… త్రిష కు కోపం వచ్చిందేమో “…

Read more

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం

అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య ఎన్నిక ఆదివారం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం సాధించింది. దర్శకుల సంఘ అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్ గా సాయి రాజేశ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో ఇదే హైయెస్ట్ మెజారిటీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ వద్ద ఉన్న స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ఒకప్పుడు దర్శకుల సంఘం ఇండస్ట్రీని లీడ్ చేసేది. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి. ఇప్పుడు…

Read more

సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి పవర్ ఫుల్ విమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

వెర్సటైల్ హీరోయిన్ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హై-వోల్టేజ్, హీరోయిన్-సెంట్రిక్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్‌'లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ది బ్లాక్ గోల్డ్' టీం ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ సంయుక్త ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతం మధ్యలో నిలబడి కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కథలోని కఠినమైన పరిస్థితులను ప్రతిబింబించేలా ఆ మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌ను చూపించారు. పోస్టర్‌లో సంయుక్త చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపించారు. ఆమె ముఖం మీద దుమ్ము, చేతులపై గాయాలు కనిపించడం కథలో ఘర్షణను ప్రజెంట్ చేస్తోంది. ఈ…

Read more

‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి.. – హీరో శివాజీ

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు చిత్రయూనిట్ థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ థాంక్యూ మీట్‌లో.. *శివాజీ మాట్లాడుతూ ..* ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఎన్టీఆర్…

Read more

మైరా ఎస్టేటిక్ క్లినిక్ ను ప్రారంభించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ !!!

కర్నూలు లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైరా ఎస్టేటిక్ సెంటర్ ను పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఆదునాతనమైన ఏఐ బేస్డ్ ఇస్తాటెక్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాజ్ పుత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్నూలు కు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడి ప్రజలు తనకు ఘనస్వాగతం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎంఏసి చైర్ పర్సన్ అండ్ ఫౌండర్ శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ... ‘’ఏ ఐ టెక్నాలజీ ద్వారా మైరా ఎస్తేటిక్ క్లినిక్ ను కర్నూల్ లో ప్రారంభించడం సంతోషంగా ఉంది, అందరికి అందుబాటు ధరల్లో మేము స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు…

Read more

‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత వరకు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే ఈ పాట…

Read more

‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’

తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్ని తాజాగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ చిత్రాల్ని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘దండోరా’కి అవార్డు వచ్చింది. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘దండోరా’ చిత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మంచి పేరు సంపాదిచుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలో రూపొందించిన ‘దండోరా’ చిత్రానికి తాజాగా గద్దర్ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు…

Read more

‘గద్దర్ అవార్డు 2025’లో రెండు అవార్డులను సాధించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి గానూ ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. చిన్న చిత్రంగా థియేటర్లోకి వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీకి గద్దర్ అవార్డులు కూడా రావడంతో తగిన గుర్తింపు లభించినట్టు అయింది. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ ఓ కీలక పాత్రను పోషించాడు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. థియేటర్లో మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీకి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన గద్దర్…

Read more

గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన “రాజు వెడ్స్ రాంబాయి”మూవీ

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ సహా నాలుగు అవార్డ్స్ దక్కించుకున్న మూవీ కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది "రాజు వెడ్స్ రాంబాయి". ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ సత్తాచాటింది. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ..ఇలా నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ సినిమా అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, స్పెషల్ జ్యూరీగా చైతన్య జొన్నలగడ్డ గద్దర్ అవార్డ్స్ స్వీకరించనున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి…

Read more

“లిటిల్ హార్ట్స్” చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న సాయి మార్తండ్

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా కొత్త దర్శకుడు సాయి మార్తండ్ "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతున్నాయి. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో లిటిల్ హార్ట్స్ సినిమాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా సాయి మార్తండ్ అవార్డ్ గెల్చుకున్నారు. చదువుల్లో వెనకబడిన ఓ జంట మధ్య సాగిన ప్రేమ కథను ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి తన ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు సాయి మార్తండ్. లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ…

Read more