‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్గా అనిపించే యూత్ఫుల్ చిత్రం టీజర్ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. కాగా ఈ చిత్రం టీజర్ను ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ '' నిర్మాత బెక్కం వేణుగోపాల్ ''హుషారు పిట్టలు' సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్ యంగ్స్టర్ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు…
