Skip to content

మారెమ్మ’ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది: డైరెక్టర్ బాబీ కొల్లి

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది. ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి, ప్రజలు, పశువుల ప్రాణాలను బలిగొంటుంది. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన పవిత్ర ఎద్దును కాపాడే బాధ్యత హీరోది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఇక్కడినుంచే కథ కీలక మలుపులు తిరుగుతుంది. ఇది…

Read more

‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చారు. ఈ అదనపు సమయంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్‌ లుక్‌లో అదరగొట్టారు. పొడవైన జుట్టు, రగ్గడ్ గడ్డం, నోస్ రింగ్‌తో ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఆయన పదునైన చూపు నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తుంది. చుట్టూ అలసిపోయిన, ముఖాల్లో వేదన కనిపించే జనసమూహం మధ్య నుంచి ఆయన రావడం ఎమోషన్ ని…

Read more

first female villain of the franchise under wraps!

Mallika Prasad aka ‘Amma’, the first female villain in the hit Mardaani franchise, has become a huge talking point of Mardaani 3, given her magnetic, bone-chilling on-screen impact! The acclaimed actor reveals how Yash Raj Films built the strategy to keep her under wraps pre-release for her character to have maximum impact on screen for the audience! Mallika says, “There's always a lot of joy in the movies whenever there is a big reveal or there is a surprise. The…

Read more

పవన్ కళ్యాణ్‌తో రాజేంద్ర ప్రసాద్ భేటీ

అమరావతి: ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయడంలో కీలక పాత్ర పోషించి, తనకు అండగా నిలిచినందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆత్మీయంగా హత్తుకుని, ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ వంటి గొప్ప గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. ఆత్మీయ పలకరింపు: తనకెంతో ఇష్టమైన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మ పురస్కారం రావడం పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో…

Read more

బరాబర్ బాధపడుతున్నాను!! – జె. డి. చక్రవర్తి

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ... "సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో... ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, "భాష"లతో కాదని నేను బలంగా నమ్ముతాను" అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు!!

Read more

AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పోటీకి టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నాయకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు “రోడ్ టు AVAA ఎంటర్‌టైన్‌మెంట్” అనే పేరుతో ప్రోమో విడుదల చేయగా.. దీనికి భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 11,000కు పైగా ఇంక్విరీస్ రాగా, 3,000కు మించిన షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి. వచ్చిన అన్ని అప్లికేషన్స్ నుంచి టాప్ 100 షార్ట్ ఫిలిమ్స్ ఎంపిక చేశారు. ఈ చిత్రాలను ఫిబ్రవరి 19 నుంచి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ షోకు టాలీవుడ్ నటుడు శివ బాలాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు…

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’లో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్ ను…

Read more

“శ్రీ చిదంబరం గారు” అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన "శ్రీ చిదంబరం గారు". వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి. - కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో "శ్రీ చిదంబరం గారు" చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా టీమ్ నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు. క్రౌడ్ ఫండెడ్ మూవీగా స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టం చూసి మా అమ్మాయి ఈ…

Read more

“లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. "లీడర్" సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన "లీడర్" గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - విలన్ కు చెందిన 9 కంటెయినర్లు కనిపించకుండా పోతాయి. ఆ కంటెయినర్స్ కోసం విలన్ అనుచరులు వెతుకుతుంటారు. ఒక చోట…

Read more

టికెట్ కొనుక్కుని ‘ఎర్రచీర’ సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రీ…

Read more