Skip to content

విష్ణు మంచు రిలీజ్ చేసిన ‘వంద దేవుళ్లు’ ఫస్ట్ లుక్

మల్టీ టాలెంటెడ్ విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో కలిసి వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘వంద దేవుళ్లు’ అనే చిత్రం రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా డైనమిక్ స్టార్ విష్ణు…

Read more

అడివి శేష్ ‘డెకాయిట్‌’ నుంచి జైన్ మేరీ ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్…

Read more

‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వా లి – హీరో శ్రీకాంత్

డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన కంటెంట్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఇక తాజాగా శుక్రవారం నాడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్,…

Read more

“తిమ్మరాజుపల్లి టీవీ” ఎంటర్ టైన్ చేస్తుంది – కిరణ్ అబ్బవరం

* ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్…

Read more

‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ 26న విడుదల

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక క్రేజీ క్రాసోవర్ వీడియోతో ముందుకు వచ్చారు. "జాదూ వర్సెస్ రాకీ" అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్ స్టార్…

Read more

చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన‌ చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య‌, శ్రావ్య నిర్మాత‌లు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్‌స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరో హీరోయిన్ మ‌ధ్య ఉండే ప్రేమ‌, గిల్లిక‌జ్జాలను హ‌త్తుకునేలా రూపొందించారు. హీరో హ‌ర్ష్ రోష‌న్ త‌న మ‌ర‌ద‌లైన హీరోయిన్ ప్రేమ‌ను గెల‌వ‌టానికి ఏం చేశాడు? త‌న‌కు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగ‌మించాడు? అనే…

Read more

“యూత్” నుంచి ‘సఖియే..’ సాంగ్ విడుదల

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది…

Read more

సందీప్ కిషన్‌తో షైనింగ్ పిక్చర్స్ సినిమా

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు…

Read more

‘డైమండ్ డెకాయిట్’ ఆడియో రిలీజ్

▪️పాటలు విడుదల చేసిన వీఎన్ ఆదిత్య ▪️ చిత్రంలోని పాటకు హుక్ స్టెప్ వేసిన వారికి ₹ లక్ష బహుమతి ప్రకటన హైద‌రాబాద్: తెలుగు తెరపై స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ ద‌ర్శ‌క‌త్వంలో, పార్ధ గోపాల్ - మేఘ‌న జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాటలను ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య పాల్గొని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వినూత్న…

Read more

“హివాగ” బ్యూటీ క్లినిక్ ప్రారంభం

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో "హివాగ" ఫస్ట్ బ్రాంచ్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొంపల్లిలో రెండో బ్రాంచ్ స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా "హివాగ"కు ఇది 8వ బ్రాంచ్ కావడం విశేషం. ఈ క్లినిక్ కు హరిత రెడ్డి సతి సీఇఓ గా, రామ్ మోహన్ రెడ్డి సతి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాల అత్యాధునిక స్కిన్, హెయిర్ ట్రీట్ మెంట్స్, సెలూన్ సర్వీసెస్ ను "హివాగ" లగ్జరీ బ్యూటీ క్లినిక్ లో అందించనున్నారు. ఈ క్లినిక్ లో నిపుణులైన డెర్మటాలజిస్టుల ఆధ్వర్యంలో మెన్, వుమన్ కు ట్రీట్ మెంట్స్…

Read more