ఘనంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు !!!
పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగాయి. పేరమ్ గ్రూప్ మరియు శ్రీని ఇన్ఫ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామమ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నటులు బాబు మోహన్, ఎల్.బి.శ్రీరామ్, ఉత్తేజ్, పృథ్వి, బిత్తిరి సత్తి, ముక్కు అవినాష్, రఘు కుంచె, ఆర్పీ.పట్నాయక్, రఘుబాబు, రచ్చ రవి, ప్రగతి, ప్రభాస్ శ్రీను, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... "42 ఏళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంన్నానని అన్నారు, తాను నటుడిగా కొనసాగుతున్నాను అంటే అది తన గొప్పదనం కాదని ప్రేక్షకులదేనని అన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు శాలువా తో…
