Skip to content

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబ‌ర్‌గా బాధ్యతలు స్వీక‌రించిన అశోక్ దయ్యాల

హైద‌రాబాద్: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూత‌న కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా అశోక్ దయ్యాల బాధ్య‌తలు స్వీకరించారు. ఈ మేర‌కు అశోక్ దయ్యాలకు రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (JCHSL) అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Read more

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం" అని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ,…

Read more