Skip to content

ఉగాదికి ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్…

Read more