రమేష్ వర్మ ప్రోత్సాహంతో “కొక్కొరోకో” అంటున్న మనస్విని బాలబొమ్మల
ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం “కొక్కొరోకో” షూటింగ్ విజయవంతంగా పూర్తయ్యింది. నీలాద్రి ప్రొడక్షన్ సమర్పణలో, RV ఫిల్మ్ హౌస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. సంప్రదాయ కోడిపందాల నేపథ్యం చుట్టూ తిరిగే కథతో, ఐదు విభిన్న పాత్రలతో రూపొందిన అంథాలజీ చిత్రంగా “కొక్కొరోకో” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కథ–స్క్రీన్ ప్లేను రమేష్ వర్మ అందించగా, బలమైన విజువల్స్తో పాటు భావోద్వేగాత్మక కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2026లో విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మరో ముఖ్య విశేషం ఏమిటంటే… "మనస్విని బాలబొమ్మల" అనే ప్రతిభావంతమైన కళాకారిణి…
