Skip to content

మార్చి 26న విడుదల కానున్న G.O.A.T (గోట్)

ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్ర‌స్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం…

Read more

ఈటీవీ విన్ నుంచి “ఇంకా ఎం అనుకోలేదు” క్రేజీ టైటిల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 4న సినిమా విడుదల

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి “ఇంకా ఎం అనుకోలేదు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా వచ్చిన వారి కలయికలోని సినిమాలు వినోదభరితంగా, ప్రత్యేకమైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఇంకా ఎం అనుకోలేదు” చిత్రానికి రచయిత-దర్శకుల జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతా ఈ అనౌన్స్‌మెంట్‌ వీడియోపై, టైటిల్… [12:01 pm, 10/3/2026] Madhu: బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఈటీవీ విన్…

Read more

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా హీరోయిన్‌ లయ…

Read more

‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా మంగళస్నానం అనే హార్ట్‌ టచ్చింగ్‌ ఎమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఓ తండ్రి తన కూతురును ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో తెలుస్తుంది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో…

Read more

‘పతంగ్‌’ టీమ్‌ను అభినందించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

సినీ పరిశ్రమలో నూతన టాలెంట్‌ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్‌ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఇటీవల పతంగ్‌ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్‌ చేస్తున్నప్రమోషన్‌ కంటెంట్‌, ఆ సినిమా కాన్సెప్ట్‌ గురించి విని ఇంప్రెస్‌ అయిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్‌ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్‌ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్‌ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్‌ గారు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్‌ టీమ్‌ ఎంతో ఎనర్జీతో…

Read more