“స్కై” ఫిబ్రవరి 13న రిలీజ్
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. "స్కై" సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రావాల్సిఉండగా వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో పాటు లిరికల్ సాంగ్స్ తో మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "స్కై" మూవీ ప్రేక్షకుల దృష్టిని…
