Skip to content

శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్‌ ఇండియా

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో రైజింగ్‌ ఇండియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భారతదేశం గురించి, గొప్పతనం గురించి తెలుసుకోవాలి. మనదేశం రైజింగ్‌ ఇండియాగా మారడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల డీన్‌ మల్లేశ్, కో ఆర్డినేటర్‌ జనార్ధన్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more