Skip to content

ప్రజల క్షేమం కోసం…

ఉత్తరాఖండ్‌ వరదల నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉండాలంటూ బద్రీనాథ్‌ ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా బద్రీనాథ్‌ దాం ధర్మాధికారి ఆధ్వర్యంలో శాంతి హోమాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో హైదరాబాదుకు చెందిన పరాశర శ్రీరామ భట్టాచార్య స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రకృతి శాంతించాలి. ప్రజలందరూ వరదల నుంచి క్షేమంగా ఉండాలి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండకూడదని ప్రార్థించాను’’ అన్నారు.

Read more

శుభప్రదం శ్రీనివాస కల్యాణం

రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు పరాశర శ్రీరామ బట్టర్, సముద్రాల శిఖామణి, సముద్రాల శ్రీమన్నారాయణలు ఈ వేడుకని సంప్రదాయబద్దంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘శ్రీనివాసుల ప్రేమ వారి కల్యాణంతో సుఖాంతం అయింది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్యాణోత్సవం జరిపించడం శుభప్రదం. కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరతాయి. కల్యాణోత్సవం జరిపించటం వల్ల అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి శీఘ్రంగా కల్యాణం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్య బాగా అబ్బుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది.. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అందుకే శ్రీనివాస కల్యాణం జరిపించటం సంప్రదాయం. ఈ వేడుకలో పాలు పంచుకున్నవారికి, చూసిన…

Read more