‘రణబాలి’ అనంతపూర్ షెడ్యూల్ పూర్తి
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అనంతపూర్ లో షూటింగ్ సందర్భంగా అక్కడి స్థానికులు, రౌడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అభిమానులు బైక్ ర్యాలీలతో విజయ్ పట్ల ప్రేమను చాటుకున్నారు. విజయ్ దేవరకొండ తన రాయలసీమ అభిమానులను ఫ్యాన్స్ మీట్ లో కలుసుకున్నారు…
