Skip to content

సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ ఈవెంట్ నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్విహించబోతున్నాము…

_పి.జి. విందా, మేనేజింగ్ డైరెక్టర్ సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, మరియు కొత్త ఆవిష్కరణలు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో జరిగే ఈ “ సినిమాటికా ఎక్స్పో 2025” ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను నేను, మరియు 'సినిక క్రియేటర్స్ కౌన్సిల్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్…

Read more

అభిమానుల ఉత్సాహం మరువలేనిది

‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ గారికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి.ఆనంద్ గారికి, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. భారీ వర్షం కురుస్తున్నా ఈ…

Read more

సుకృతి వేణిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతి వేణిని ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి గారు అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉత్తమ బాలనటిగా పురస్కారానికి ఎంపికైన సుకృతి వేణితో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, చిత్ర సమర్పకురాలు, సుకుమార్‌ సతీమణి తబితా సుకుమార్‌ 'గాంధీ తాత చెట్టు' చిత్ర నిర్మాతలు వై.రవిశంకర్‌, శేష సింధురావులు సీఏం రేవంత్‌ రెడ్డి గారిని కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుకృతివేణితో పాటు నిర్మాతలను ఈ సందర్భంగా సత్కరించారు. 71 జాతీయ అవార్డ్స్ లో గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను సుకృతివేణి ఆ…

Read more

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more

సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ‘డేంజర్’ అంటూ డ్ర‌గ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం

▪ ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో పాట‌ ▪ డ్ర‌గ్స్‌పై ప్ర‌చార చిత్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌తో పాటు పోలీసు ఆఫీస‌ర్‌ల ప్ర‌శంస‌లు ▪ డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సినిమా కూడా ▪ ‘డేంజర్’ మూవీపై హీరో కృష్ణసాయి స్పెషల్ అనౌన్స్‌మెంట్ హైద‌రాబాద్: విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు…

Read more