‘డెకాయిట్’ తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్
వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం 'డకాయిట్'తో అలరించబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. ఒక భారీ షెడ్యూల్లో తన షూటింగ్ ఫినిష్ చేశారు. చిత్ర బృందం ఆమెకు ఘనంగా సెండ్ అఫ్ ఇచ్చింది, ఆమె అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ భాగమవుతారు. ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ రెండు భాషలలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ఇటీవల, చిత్ర నిర్మాతలు రిలీజ్…
