సీమంతం చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల !!!
టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతొంది. ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. రచయిత మరియు దర్శకుడిగా సుధాకర్ పాణి వ్యవహరిస్తున్నారు. సంగీతం ఎస్. సుహాస్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 14న న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు…
