భట్టి విక్రమార్క చేతుల మీదుగా ‘పిఠాపురంలో’ టైటిల్ పోస్టర్ ఆవిష్కరణ
‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్,మణిచందన, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్ , శ్రీలు, ప్రత్యూష తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. మహేష్చంద్ర సినిమా టీమ్ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ…
