పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం ప్రారంభం
టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా.. కెమెరామెన్గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా... * హీరో పవన్ కేసరి మాట్లాడుతూ* .. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ…
