Skip to content

జీ5లో ‘హే బల్‌వంత్‌’కు 50 మిలియన్ స్ట్రీమింగ్

సుహాస్ హీరోగా త్రిశూల్ విజనరీ స్టూడియో బ్యానర్ మీద బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్‌వంత్’. గోపి అచ్చర తెరకెక్కించిన ఈ చిత్రంలో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకి థియేటర్లో మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గానే ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేశారు. స్ట్రీమింగ్ చేసిన కొద్ది రోజులకే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ని సొంతం చేసుకుంది.

టీజర్, ట్రైలర్‌‌తోనే చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఉండే ఆ బిజినెస్ ఏంటి? అసలు ఆ వ్యాపారం ఏంటి? అనే ఆసక్తిని పెంచేసి.. థియేటర్ వరకు జనాల్ని రప్పించారు. సినిమాకు థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో.. ఓటీటీలోనూ అంతే స్థాయిలో ఆదరణ దక్కింది. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ చేసిన కామెడీ మేజర్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందించగా.. మహి రెడ్డి కెమెరామెన్‌గా పని చేశారు. ఈ మూవీకి విప్లవ్ నైషధం ఎడిటర్‌గా వర్క్ చేశారు.

Watch NOW on ZEE5: https://zee5.onelink.me/RlQq/sbifs8xg