Skip to content

31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ

  • MOVIES
  • Vishwanath
WhatsApp Image 2026-02-08 at 7.13.27 PM

హైదరాబాద్: శంకర్‌పల్లి రోడ్‌లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం ముగింపు (వాలెడిక్టరీ) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తాండూరుకు చెందిన ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్ అనుబంధ సంస్థ) ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల సంస్థలకు పురస్కారాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి నాగ్‌పూర్‌లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గనుల చీఫ్ కంట్రోలర్ డా. వై.జి. కాలే, దక్షిణ మండల గనుల కంట్రోలర్ శ్రీ శైలేంద్ర కుమార్, ఎం/ఎస్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) సీఈఓ & నామినేటెడ్ ఓనర్ శ్రీ సుకురు రామారావు, ఏవీపీ మైన్స్ & జియాలజీ శ్రీ భాను ప్రకాష్ భట్‌నాగర్, ఎంఈ&ఎంసీ 2025-26 చైర్మన్ శ్రీ ఎల్.ఎం.కె.వి శ్రీనివాస్, ఎంఈ&ఎంసీ 2025-26 పేట్రన్ మరియు డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ (ఐ/సి), ఐబిఎం హైదరాబాద్ శ్రీ ఆర్. రామ్‌కిషన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025 డిసెంబర్ 15 నుండి 20 వరకు గనుల పర్యావరణ & ఖనిజ సంరక్షణ వారం నిర్వహించబడింది. శాస్త్రీయ గనుల తవ్వకాల పద్ధతులను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. రాష్ట్రంలోని 30 యంత్రసామగ్రి ఆధారిత గనులు, 5 మాన్యువల్ గనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సీనియర్ గనుల అధికారులతో కూడిన బృందాలు తెలంగాణలోని సుమారు 35 గనులను సందర్శించి గనుల అభివృద్ధి విధానాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సుస్థిర గనుల నిర్వహణ వ్యవస్థలను సమీక్షించాయి.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ పంకజ్ కుల్ష్రేష్ఠ మాట్లాడుతూ , పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో గనుల తవ్వకాలు జరగాలని పేర్కొన్నారు. ఖనిజ నిల్వలను సక్రమంగా గుర్తించడం, భౌగోళిక సర్వేలు నిర్వహించడం, అవసరమైన అనుమతులు పొందడం, ప్రజల అభ్యంతరాలను పరిష్కరించడం బాధ్యతాయుత గనుల నిర్వహణలో కీలకమని తెలిపారు. గనుల తవ్వకాలు పూర్తైన తర్వాత భూసంస్కరణ, వృక్షారోపణ మరియు భూభాగ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు.

శ్రీ రాంకిషన్ రావుల మాట్లాడుతూ గనుల పర్యావరణ కనిజ సంరక్షణ వారం 31 వ సారి ఈరోజు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గన్నుల రంగంలో అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి విధానాలు అమలు లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాము మైనింగ్ రంగంలో సముదాయాలు సుస్థిరత ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతోపాటు మైనింగ్ లో కూడా ఎన్నో మార్పు చేర్పులు మునుపటికంటే కొత్త విధానాలతో మైనింగ్ చేపట్టడం పర్యావరణం ని పరిరక్షిస్తూ ఖచ్చితమైన గనులు నిర్దేశించడం మైనింగ్ పూర్తయిన తర్వాత వాటిని మళ్లీ తిరిగి పర్యావరణంగా మార్చే విధానాలు ఎన్నో ఇప్పటి తరంలో సాధ్యం చేస్తున్నాము ఇటువంటి అంశాలన్నీ అందరిలోకి తీసుకువెళ్లటం తెలియజేయడం మా ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

ఈ వేడుకలకు శ్రీ రాంకిషన్ రావుల, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, భారత గనుల బ్యూరో – హైదరాబాద్ ప్రాంతం, ముఖ్య సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.