సరస్వతి’ కథ విని షాక్ అయ్యాను : డైరెక్టర్ గోపీచంద్ మలినేని
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ రోజు బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. వరలక్ష్మీ చాలా ఎమోషనల్ పర్శన్. నేను క్రాక్ చేసినప్పుడు జయమ్మ క్యారెక్టర్ ఎలా…
