విజయ్ సేతుపతి చేతుల మీదుగా ‘డోంట్ స్లీప్’ ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళ సినిమా తన సహజమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అగ్రశ్రేణి మలయాళ చిత్రనిర్మాతలు ఇప్పుడు ప్రముఖ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. 'మిన్నల్ మురళి' ఫేమ్ బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్తో ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా, 'కిష్కింధ కాండం', 'ఏకో' చిత్రాలతో పేరుగాంచిన దిన్జీత్ అయ్యతన్, ప్రభాస్తో ఒక ప్రాజెక్ట్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలుగులో యూనిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వస్తోంది. గతంలో మలయాళ-తమిళ ద్విభాషా థ్రిల్లర్ మమ్ముట్టి 'స్ట్రీట్ లైట్స్'కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్దత్, ఇప్పుడు 'చౌర్య పాఠం'లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి. చూడామణి ఈ…
