మిరాయ్కి తప్పకుండా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు: కార్తీక్ ఘట్టమనేని
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 'మిరాయ్'. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మిరాయ్ స్టోరీ ఐడియా ఎప్పుడు జనరేట్ అయింది? మిరాయ్ కథ ఎలా వుండబోతోంది ? -ఏడేళ్ల క్రితమే ఈ ఐడియా పుట్టింది. ఈ ఆలోచనకి…
