Skip to content

ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫౌండేషన్’ ‌ ఛైర్మన్‌ సంజయ్‌కిషోర్‌ నిర్వహణలో హైదరాబాద్‌ లో సావిత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సావిత్రి గారి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ- మహానటికి మరణం లేదని, నవరస అద్భుత నటనా కౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు. తన నట జీవితంలో ప్రతి చిత్రంలో కూడా కేవలం పాత్ర మాత్రమే కనిపించేదని, సావిత్రి కనిపించేది కాదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ-…

Read more

క్రమశిక్షణే ఎవరికైనా “లక్ష్మణరేఖ”

"లక్ష్మణరేఖ" గోల్డెన్ జూబిలీ వేడుకలో మురళీ మోహన్ - జయసుధ గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్ - జయసుధ జంటగా నటించిన "లక్ష్మణ రేఖ" చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసిన రాజేంద్రప్రసాద్ లను ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీరంతా 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి, అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావాలను లక్ష్మణరేఖలుగా మలచుకుని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు రామసత్యనారాయణను అభినందించారు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్. రామచంద్రరావు, తెలుగు…

Read more

“వేదవ్యాస్” సినిమా ఘనంగా ప్రారంభం

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత,…

Read more

ఆనందం, ఆహ్లాదం కలిపిన వైభోగం… అసలైన ప్రతిభకు పట్టాభిషేకం..

అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ గారు, మొదలైన వారు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు…

Read more

ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభం

భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్…

Read more

డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్న ‘సుప్రీమ్ వారియర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుప్రీమ్ వారియర్స్’. ఈ చిత్రానికి పెదపూడి బాబూ రావు నిర్మాతగా, హరి చందన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సోమవారం (ఆగస్ట్ 11) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దవళ సత్యం, బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీర శంకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శివ రాజ్ పాటిల్, మార్కాపురం శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. దవళ సత్యం, డా. మురళీ మోహన్ గారు గౌరవ దర్శకత్వం వహించారు…

Read more

మేం తీసిన చిత్రాలన్నీ ఒకెత్తు.. ‘అతడు’ ఇంకో ఎత్తు -మురళీ మోహన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలానే నిలిచింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..   మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘మా బ్యానర్‌లో 2005 ఆగస్ట్ 10న అతడు సినిమాను రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నాం. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్…

Read more