Skip to content

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది : నారా చంద్రబాబు నాయుడు గారు

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు గండిపేటలో ఘనంగా జరిగాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ అభినందనలు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షిక ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. గండిపేటకు వస్తే నాకు చాలా జ్ఞాపకాల గుర్తుకొస్తాయి. గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం పార్టీ హెడ్ క్వార్టర్స్. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసిన తర్వాత, నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పని చేశాను. ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన…

Read more

1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదల అయిన విక్రమ్ పూల రచించిన 1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాము. ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లు గా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…

Read more

అభిమానుల ఉత్సాహం మరువలేనిది

‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ గారికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి.ఆనంద్ గారికి, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. భారీ వర్షం కురుస్తున్నా ఈ…

Read more

‘సంతోషం అవార్డ్స్’కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సురేష్ కొండేటి

యాంకర్: సంతోషం అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరుకావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించారు సంతోషం అధినేత సురేష్ కొండేటి. ఆ వివరాలు.. వాయిస్: ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తూ ఉండే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం భారతదేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులకు తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న…

Read more

తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌…

Read more