బూకి యూత్ తో పాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా : నిర్మాత రామంజేయులు జవ్వాజీ
అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బూకి'. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామంజేయులు జవ్వాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? -ప్రతి లవ్ స్టోరీ లో కథ ప్రేమతోనే మొదలవుతుంది. కానీ ఈ కథ మాత్రం బ్రేకప్ తో మొదలవుతుంది. బ్రేకప్…
