Skip to content

రిచర్డ్ రిషి నటిస్తున్న ‘ద్రౌపది 2’ నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ రిలీజ్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని…

Read more

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది కొద్దీరోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. గత రాత్రి మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి పెద్ద షాక్‌గా మారింది. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినిమాల్లో అడుగుపెట్టి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.

Read more

ఆంధ్ర కింగ్ తాలూకా’ రామ్ గారి కెరీర్ చాలా స్పెషల్ మూవీ : డైరెక్టర్ మహేశ్ బాబు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్…

Read more

స్వయంభు ఫిబ్రవరి 13న మహా శివరాత్రికి థియేటర్లలో రిలీజ్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ రోజు మేకర్స్ భారీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. రెండు సంవత్సరాల ప్రయాణం,170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను,…

Read more

అఖండ 2లో బాలయ్య బాబు విశ్వరూపం చూస్తారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. 'అఖండ 2' ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి ? అఖండ కి మించిన…

Read more

#పూరిసేతుపతి షూటింగ్ పూర్తి

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ #పూరిసేతుపతి షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్ కి సంబధించిన వీడియోను టీం విడుదల చేసింది వీడియోలో, పూరి, మొత్తం యూనిట్‌తో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి తెలియజేస్తూ, ఈ ప్రయాణాన్ని మెమరబుల్, ఆనందకరమైన అనుభవంగా చెప్పారు. పూరి, చార్మీ తమ భావాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన బాండింగ్ ని తెలియజేశారు. విజయ్, పూరి జాకెట్‌ చాలా బావుందని అభినందించడం ఫేర్ వెల్ కు ఫన్…

Read more

డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా పతంగ్‌ విడుదల

న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు తాజాగా 'పతంగ్‌' చిత్ర టీమ్‌తో చేతులు కలిపారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన 'పతంగ్‌' చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్…

Read more

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి – బన్నీ వాస్, వంశీ నందిపాటి

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 3…

Read more

ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లో 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న కల్ట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. నైజాం ఏరియాలో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తోందీ మూవీ. నైజాంలో డే 1 కు రెట్టింపు వసూళ్లను డే2 రాబట్టింది "రాజు వెడ్స్ రాంబాయి". తొలి రోజు కోటి రూపాయల గ్రాస్ ఈ సినిమాకు కలెక్ట్ కాగా, రెండో రోజు 2 కోట్ల రూపాయల…

Read more

యుపి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, అఖండ 2 ది తాండవం నిర్మాతలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ 2 ది తాండవం పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ముంబైలో సింగిల్ విడుదల చేశారు. బెంగళూరులో అద్భుతమైన ట్రైలర్ లాంచింగ్ తర్వాత ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ సనాతన ధర్మాన్ని అద్భుతంగా చాటి చెప్పింది . బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అఖండ టీంని కలవడానికి సమయం తీసుకున్నారు. సినిమాలో రష్‌లను వీక్షించారు. ఈ…

Read more