‘’ఉత్తుత్త హీరోలు‘’ ఫిబ్రవరి 27న విడుదల
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్ విట్టా తొలిసారిగా నిర్మాణంలోకి అడుగుపెట్టారు, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనాన్ని ఎంచుకున్నారు. మహేష్ విట్ట ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత మరియు హీరోగా రాబోతున్నాడు. ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి. “ఉత్తుత్త హీరోలు” రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో హాస్యం మరియు ఉత్కంఠభరితమైన అంశాలను మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు, అలాగే "రాయలసీమ నుండి వచ్చిన మొదటి కల్ట్ ఫిల్మ్" మరియు చిత్ర షూటింగ్ మొత్తం కడప జిల్లాలో చేసినట్లు, కడప జిల్లా నుండి ఎంచుకున్న 75 మంది…
