Skip to content

మోహన్ బాబు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ శివమణి, మీడియా దిగ్గజం విజయ్ దర్దాకు డాక్టరేట్ ప్రదానం*

మోహన్ బాబు విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ శివమణి, మీడియా దిగ్గజం విజయ్ దర్దాకు డాక్టరేట్ ప్రదానం* Telugu News

మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) రెండో గ్రాడ్యుయేషన్ డే తిరుపతిలో శనివారం (ఆగస్ట్ 2) నాడు ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రముఖులు, గ్రాడ్యుయేట్లు, గౌరవనీయ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శ్రీ ప్రఫుల్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఎం.బి.యు ఛాన్సలర్, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (SVET) చైర్మన్ డాక్టర్ ఎం. మోహన్ బాబు, ఎం.బి.యు ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు, గ్రాడ్యుయేషన్ బ్యాచ్‌కు సంయుక్తంగా డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఎస్వీఈటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వినయ్ మహేశ్వరి, ట్రస్ట్ నాయకత్వంలో కీలక సభ్యురాలు శ్రీమతి విరానికా మంచు కూడా పాల్గొన్నారు.

1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. 33 సంవత్సరాలకు పైగా, ఈ ట్రస్ట్ విభిన్న రంగాలలోని వేలాది మంది విద్యార్థుల్ని ఉన్నత స్థాయికి చేరుకునేలా తీర్చి దిద్దింది. ఈ విద్యాలయానికి వ్యవస్థాపకుడు అయిన డాక్టర్ మోహన్ బాబు నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగారో.. విద్యా వేత్తగానూ అంతే స్థాయికి ఎదిగారు. ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే అతని దార్శనికతను ఇప్పుడు అతని కుమారుడు శ్రీ విష్ణు మంచు ముందుకు తీసుకు వెళ్తున్నారు.

గౌరవ డాక్టరేట్లు ప్రదానం
సమాజానికి వారి అసాధారణ కృషికి గుర్తింపుగా, మోహన్ బాబు విశ్వవిద్యాలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఇద్దరికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది.

లోక్‌మత్ మీడియా గ్రూప్ ఛైర్మన్ శ్రీ విజయ్ దర్దా‌కు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈయన ఒక అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయిన శ్రీ దర్దా పత్రికా స్వేచ్ఛ, విద్య, ప్రజాస్వామ్య సంస్కరణలను తీసుకు వచ్చిన శక్తివంతమైన న్యాయవాది. మహారాష్ట్రలోని అత్యంత ప్రభావవంతమైన మీడియా సంస్థకు ఈయన అధినేత.

పద్మశ్రీ శివమణికి డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. చెన్నై నుండి వచ్చిన శివమణి ఈ తరంలోని అత్యుత్తమ పెర్కషన్ వాద్యకారులలో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించుకున్నారు. అంతర్జాతీయ కచేరీలు, ఎ.ఆర్. రెహమాన్‌తో ప్రోగ్రాంలు, ఇతర ప్రదర్శనలతో శివమణి భారతీయ లయ, కళాత్మకత రంగాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు. ఈ గౌరవ డిగ్రీలను ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు, ప్రో-ఛాన్సలర్ శ్రీ విష్ణు మంచు ప్రదానం చేశారు. ఇది MBUకి గర్వకారణం.

పెన్ స్టేట్ యూనివర్సిటీతో అంతర్జాతీయ విద్యా సహకారం
ఈ వేడుకలో మోహన్ బాబు విశ్వవిద్యాలయం USAలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ (పెన్ స్టేట్)తో చేసుకున్న ఉమ్మడి-డిగ్రీ భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించారు. ఓ ఫారిన్ యూనివర్సిటీతో భాగస్వామ్యం పెట్టుకున్న ఏకైక, మొదటి యూనివర్సిటీగా ఎం.బి.యు నిలిచింది. ఈ ప్రత్యేకమైన విద్యా సహకారం MBU విద్యార్థులకు అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకదాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్, పరిశోధన మార్గాలు, డ్యుయల్ డిగ్రీ ఎంపికలతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లను కొనసాగించే అవకాశాన్ని అందిస్తుంది.

మోహన్ బాబు విశ్వవిద్యాలయం భారతీయ విద్యలో కొత్త ప్రమాణానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక్కడ సంప్రదాయం సాంకేతికతను కలుస్తుంది. ఈ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్లను మాత్రమే కాకుండా.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆవిష్కర్తలు, నాయకులు, మార్పును సృష్టించేవారిని తయారు చేస్తోంది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.