మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
ప్రముఖ నటుడు పృద్వి రాజ్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” మూవీ మోషన్ పోస్టర్ విడుదల !!!

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు పృద్వి రాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “బ్లడ్ రోజస్ సినిమా లో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. మోషన్ పోస్టర్ చాలా బాగుంది, ఈ సినిమా విజయం సాధించి డైరెక్టర్ ఎంజిఆర్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారికి, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప గారికి నిర్మాత హరీష్ కె గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా,సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు తదితరులు నటించారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా చిత్రీకరణ చేశారు.
బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది, త్వరలో ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ ఒగి రెడ్డి శివకుమార్ సంగీతం పెద్దపల్లి రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది.
