Skip to content

సంగీత్‌ శోభన్‌ మిస్టరీ ఎంటర్‌టైనర్‌ ‘గ్యాంబ్లర్స్‌’ ట్రైలర్‌ విడుదల

మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్‌ క్రేజీ హీరో సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'గ్యాంబ్లర్స్‌'. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు…

Read more

ఘనంగా “స్కై” సినిమా నుంచి ‘జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్’ లాంఛ్, త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "స్కై" సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్' లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ - "స్కై" సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి…

Read more

‘దండోరా’ మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు*

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో శివాజీ, న‌వదీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఇప్పుడు టాలెంటెడ్ సింగ‌ర్ అదితి భావ‌రాజు న‌టిగా…

Read more

భైరవం నా కెరీర్‌ మోస్ట్‌ మెమరబుల్‌ మూవీ– హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం' క్యూ & ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. మనోజ్ గారు సినిమాలో మీ వాయిస్, డిక్షన్ మోహన్ బాబు గారి సిమిలారిటీస్ కనిపించింది? ఇది కావాలని ట్రై చేశారా ? -అది డిఎన్ఏ. ఆయన…

Read more

’25 ఇయర్స్ అఫ్ శేఖర్‌ కమ్ముల’ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ములని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్‌ కమ్ముల. ఈ సందర్భంగా '25 ఇయర్స్ అఫ్ శేఖర్‌ కమ్ముల' సెలబ్రేటింగ్ ది సోల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్‌ కమ్ముల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ''టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. 'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ . 'lets celebrate' అని మా team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని generationsని inspire…

Read more

పర్సంటేజ్ సమస్యను హరిహర వీరమల్లుకు ముడిపెట్టడం సమంజసం కాదు * టికెట్ ధరలు పెంచి సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని దూరం చేయొద్దు * కోట్లు పెట్టాం, ఐదేళ్లు తీశామని చెబితే ప్రేక్షకుడు థియేటర్ ఎందుకు వస్తాడు -ఆర్. నారాయణమూర్తి

ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పులేదని ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. అదే సమయంలో హరిహర వీరమల్లు పేరుతో పర్సంటేజి సమస్యను పక్కదారి పట్టించారని ఆయన ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన రావడం, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్ కుట్ర కోణం ఉందని అనుమానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఇటీవల సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.... * రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవార్డులను తెలంగాణ…

Read more

భైరవం’ సినిమాని అందరూ థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా…

Read more

విశ్వ విఖ్యాత నందమూరి తారకరామారావు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మహానాడు పర్వదిన సందర్బంగా వెంకటరమణ పసుపులేటి సృష్టించిన “ధర్మచక్రం “సినిమా ఆడియో విడుదల……

సంచలనాలకు తెర లేపబోతున్న ‘ధర్మచక్రం’ మూవీ చంద్రన్న చరిత్ర స్ఫూర్తితో SIFAA సంస్థ నిర్మాణం తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘ధర్మచక్రం’. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ధర్మచక్రం’ సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. ‘ధర్మచక్రం’ సినిమా చంద్రబాబు నాయుడు గారుఎంతో కష్టపడి, పార్టీ విలువలను కాపాడిన జీవన…

Read more

నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్.. ఆకట్టుకునే విజువల్స్, ఆర్ఆర్*

రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది. తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను…

Read more

‘థగ్ లైఫ్’ చాలా గొప్ప సినిమా. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి తీసిన సినిమా. జూన్ 5న మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్' భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్ లో…

Read more