నేటి ట్రెండ్ కు తగ్గట్టు ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి “కానిస్టేబుల్” ట్రైలర్ ఈవెంట్ లో సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్
జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం "కానిస్టేబుల్".ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA మల్టీ ప్లెక్స్ థియటర్ లో ఘనంగా జరిగింది.. సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా డా: రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా…
