Skip to content

‘మేఘన’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్

యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌థ‌నంలో యూనిక్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు తెర‌పైకి రాబోతోంది. 'చిత్రం' శ్రీను ,సుష్మ , రామ్ బండారు హీరోహీరోయిన్లు గా సుధాకర రెడ్డి వ‌ర్ర‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మేఘన’ శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా హీరో ‘చిత్రం’ శ్రీనివాస్ మాట్లాడుతూ – “మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా విజయం సాధిస్తుందని, నా ఖాతాలో మ‌రో హిట్ ప‌డుతుంద‌ని నమ్మకం ఉంది,…

Read more

ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ యాక్షన్ మూవీ “తక్షకుడు”

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన సినిమా "తక్షకుడు". ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు వినోద్ అనంతోజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబోలో వచ్చిన "మిడిల్ క్లాస్ మెలొడీస్" సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో "తక్షకుడు" సినిమా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని నాగవంశీ.ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. "తక్షకుడు" సినిమాలో నితాన్షీ గోయెల్ నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ' వేటగాడి చరిత్రలో జింకపిల్లలే నేరస్థులు..' అనే…

Read more

“K-ర్యాంప్”లో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కు లోటు ఉండదు – డైరెక్టర్ జైన్స్ నాని

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు దర్శకుడు జైన్స్ నాని. - "K-ర్యాంప్" అనే టైటిల్ ఈ కథకు సరిపోతుందనే పెట్టాం. బూతు పదం అని ఆలోచించలేదు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథానుసారం అతని క్యారెక్టర్ ఇబ్బందుల్లో…

Read more

వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ కు థియేటర్స్ లో మంచి స్పందన, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు !!!

నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ కొత్తగా ఉంది..ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కొత్తగా అనిపిస్తాయి. మర్డర్స్ మిస్టరీ మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు బాగా పేలాయి ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ ని అందించాడు.. వరుణ్ సందేశ్ అనగానే…

Read more

ఇద్దరమ్మాయిలతో లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గమ్మత్తుగా ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌

సూపర్‌ ఇంట్రెస్టింగ్‌ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్‌ ఓటిపి టీమ్‌. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌. ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్‌ కనకాల నటించారు. భవప్రీతా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన ‘లవ్‌ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్‌ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్‌ డిమాండ్‌…

Read more

అక్టోబర్ 15న “మిత్ర మండలి” మూవీ ప్రీమియర్స్

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 న ప్రీమియర్ షోలు ఇక కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో అక్టోబర్ 15న ప్రీమియర్లతో ఆడియన్స్ ముందుకు రాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా చాలా బాగా రావడం, ఆద్యంతం నవ్వించే బడ్డీ కామెడీ మూవీ కావడంతో ఒక రోజు…

Read more

‘ఒక మంచి ప్రేమ కథ’‘ఒక మంచి ప్రేమ కథ’ను అందరిలోనూ ఆలోచనను రేకెత్తించేలా తెరకెక్కించాను .. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు అక్కినేని కుటుంబరావు

రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. నటి రోహిణి ముల్లేటి మాట్లాడుతూ .. ‘‘కోర్ట్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాను. ఎప్పుడూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ‘ఒక మంచి ప్రేమ కథ’తో రాబోతోన్నాను. ఓల్గా గారు…

Read more

‘మోగ్లీ 2025’ డిసెంబర్ 12న రిలీజ్

'బబుల్ గమ్' తో సక్సెస్ ని అందుకున్న హీరో రోషన్ కనకాల 'మోగ్లీ 2025'తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో సాగే యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన 'మోగ్లీ 2025' ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈరోజు, నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. 'మోగ్లీ 2025' డిసెంబర్ 12న థియేటర్లలోకి వస్తుంది. డిసెంబర్ రెండవ వారంలో ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడం"మోగ్లీ 2025"కు పెద్ద ప్లస్ పాయింట్‌గా కానుంది. నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన ఫస్ట్ గ్లింప్స్‌తో…

Read more

“ఫెయిల్యూర్ బాయ్స్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్ పై వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఫెయిల్యూర్ బాయ్స్" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ధన శ్రీనివాస్ జామి మాట్లాడుతూ - ఈ రోజు మా…

Read more

ప్రధాన మంత్రి మోదీని కలిసి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) చైర్మన్ అనిల్ కామినేని, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విరేందర్ సచ్దేవా కలిసి ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా, APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు. అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను (Archery) తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు ..ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు…

Read more