ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ ట్రైలర్
ధనుష్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్ మై’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ధనుష్, కృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యి వారిని ప్రశంసిస్తున్నారు. సినిమాలోని పాత్రలు, వాటి మధ్య ఉన్న ఎమోషన్స్, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం ఇలా అన్నీ కలిసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైలర్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో సినిమా చూడాలనే ఎగ్జయిట్మెంట్ మరింతగా పెరుగుతోంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కొన్ని పరిస్థితుల్లో హీరో ప్రేమను కోల్పోవటం, ఆ బాధ నుంచి బయటకు రావటం వంటి ఫీలింగ్స్ను…
