‘మిత్ర మండలి’ అందరినీ అలరించేలా ఉంటుంది – ప్రియదర్శి
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా హీరో ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. అనుదీప్, విజయేందర్ కలిసి ఈ కథను రాసుకున్నారా? అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్,…
