“శ్రీ చిదంబరం గారు” అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన "శ్రీ చిదంబరం గారు". వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి. - కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో "శ్రీ చిదంబరం గారు" చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా టీమ్ నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు. క్రౌడ్ ఫండెడ్ మూవీగా స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టం చూసి మా అమ్మాయి ఈ…
