Skip to content

లక్ష్మీ మంచు – గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌పై సహకార అవకాశాల అన్వేషణ హైదరాబాద్, తెలంగాణ — టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ మంచు, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని, దేవేంద్ర విద్యాలయ డైరెక్టర్ విజయేందర్ గౌడ్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” కార్యక్రమంతో సంయుక్తంగా పనిచేసే అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థాపించబడుతున్న సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా సమానమైన, నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ లక్ష్యాలను అనుసంధానించే అంశంపై ప్రధానంగా చర్చించారు. యంగ్ ఇండియా కార్యక్రమం SC, ST, BC మరియు మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులను ఒకే…

Read more

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి .. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు.

Read more

“వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026” సదస్సులో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన World Economic Forum వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని Zurich లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి గారు సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని…

Read more

ఫూలే” సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన "ఫూలే" సినిమా ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి…

Read more

“శ్రీమద్ భాగవతం పార్ట్-1” షూటింగ్ ప్రారంభం

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం "శ్రీమద్ భాగవతం పార్ట్-1" సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు . "శ్రీమద్ భాగవతం" వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా రూపొందుతున్న‌ ఈ సినిమా ప్రేక్షకులకు స‌రికొత్త అనుభవాన్ని అందించనుంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో "శ్రీమద్ భాగవతం పార్ట్-1" చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 14,2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్…

Read more