Skip to content

‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం

▪️ ఫిలింనగర్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు ▪️ కీలక పాత్రలో ప్రముఖ నటి ఇంద్రజ హైదరాబాద్: భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్ కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ, “స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా…

Read more

ఘనంగా ఆదిభట్ల నారాయణదాసు 81వ వర్ధంతి ఉత్సవాలు

హరికథా గానంతో అలరించిన కళాకారులు హైదరాబాద్: శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ శృంగేరి శారద శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస వరేన్యుల 81వ వర్ధంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జ‌రిగాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన 'రామాయణ హరికథా సప్తాహం' ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యాన్ని నింపింది. కళాకారులకు అండగా కరాటే కళ్యాణి కార్యక్రమ నిర్వాహకురాలు, శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, నటి కరాటే కళ్యాణి చేస్తున్న కృషిని ప్రముఖ నటులు సుమన్ తల్వార్ కొనియాడారు. అంతరించిపోతున్న హరికథా కళారూపాన్ని కాపాడటంలో కళ్యాణి ముందుంటున్నారని, తన తండ్రి స్ఫూర్తితో ఏటా…

Read more

గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో ‘రిమ్‌జిమ్’ మూవీ

▪️‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా ▪️ నిజ సంఘటనల ఆధారంగా ‘రిమ్‌జిమ్’ ▪️ న‌టించి పాట‌లు పాడిన‌ రాహుల్ సిప్లిగంజ్ ▪️ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ ద‌ర్శ‌క‌త్వంలో, సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతోంది. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ, సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. AV సినిమాస్ , సి…

Read more

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రధాన పదవులకు జరిగిన తాజా ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల మరోసారి కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. ‘మన ప్యానల్’ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్మాతల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలుపొంది, అనంతరం 2025–2027 పదవీకాలానికి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల సభ్యులకు, నూతన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ''గత క‌మిటీలో దిల్‌ రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను, ఈ పర్యాయం దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఉన్న క‌మిటీలో సంయుక్త కార్యదర్శిగా ప‌ని…

Read more