ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న “అదే నీవు అదే నేను” మూవీ
ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన దర్శకుడు కొండల్ "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా "అదే నీవు అదే నేను". ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందించారు. "అదే నీవు అదే నేను" సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంపై మూవీ నిర్మాత గోవిందు కాండ్రేగుల, చిత్ర దర్శకుడు కొండల్, ఇతర టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొండల్ మాట్లాడుతూ…
