ఆనందం, ఆహ్లాదం కలిపిన వైభోగం… అసలైన ప్రతిభకు పట్టాభిషేకం..
అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ గారు, మొదలైన వారు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు…