1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తక ఆడియో రూపం
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 6న విజయవాడ లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా విడుదల అయిన విక్రమ్ పూల రచించిన 1984: పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆడియో రూపంలోకి తెస్తున్నాము. ఈ పుస్తకానికి లభించిన అపూర్వ ఆదరణ నేపథ్యంలో దీనికున్న చారిత్రక ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఆడియో రూపంలో అందిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలకు చేరుతుందనే ఉద్దేశ్యంతో ప్రముఖ యాంకర్ శ్రీమతి గాయత్రి గాత్రధారణలో ఆడియో పుస్తకాన్ని అందిస్తున్నట్లు గా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ…
