అస్సాం వరద బాధితులకు అండగా నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్..
అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృతి చెందగా, 7 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు, మందులు వంటి కనీస అవసరాలు కూడా అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సహాయం అందించేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. బాధితుల కోసం బట్టలు, దుప్పట్లు, చెప్పులు, డ్రై ఫుడ్స్, బియ్యం, తాగునీరు, సానిటరీ ప్యాక్స్ వంటి నిత్యావసర వస్తువులను అందించి తమ వంతు సహాయం చేయాలని అభిమానులు, ప్రజలకు ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఈ సహాయ కార్యక్రమంలో నందమూరి మోహన రూప, తుమ్మల…
