‘మిర్జాపూర్ ది మూవీ’ స్టాండలోన్ ఫిల్మ్ : దివ్యేందు శర్మ
బాలీవుడ్ స్టార్స్ పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మిర్జాపూర్ ది మూవీ’. టాప్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘మిర్జాపూర్ ది మూవీ’ సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘మిర్జాపూర్ ది మూవీ’ చిత్ర బృందం హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ప్రెస్ మీట్ లో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మిర్జాపూర్ వెబ్ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని పెద్ద…
