“శివోహం” పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా – తనికెళ్ల భరణి
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన "శివోహం" పాట ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ సంగీతాన్ని అందించిన శివోహం పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, నటుడు గౌతమ్ రాజు అతిథులుగా పాల్గొన్నారు…
