‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది – హీరోయిన్ రాశీ సింగ్
వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం నాడు హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. విత్ అవుట్ మేకప్ నటించాను. చాలా వరకు నేచురల్గానే కనిపిస్తాను. ఇందులో కంప్లీట్ మదర్ పాత్రలా ఉండదు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే…
