‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీని క్వాలిటీతో తీశాం- వడ్డే నవీన్
వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు, దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. వడ్డే నవీన్ మాట్లాడుతూ .. ‘‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమాకి టీం అంతా కలిసి ఎంతో ప్యాషన్తో పని చేశారు. డబ్బుల కోసం పని చేసినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. అందరూ…
