విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం
హారర్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండియన్ టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ‘అఘోర’, ‘పౌరుషం’, ‘ఆప్త’, ‘దండు’, ‘రాఘవరెడ్డి’, ‘ఆదిపర్వం’ వంటి చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వివాదాల నడుమ విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం అన్ని కేంద్రాల్లో రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రయూనిట్ అనందం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల ఆదరణతో పలు ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను కూడా పెంచినట్లు నిర్మాత…
