Skip to content
‘సింగ్ గీతం’లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. – హీరోయిన్ శాలిని కొండెపుడి Telugu News

‘సింగ్ గీతం’లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. – హీరోయిన్ శాలిని కొండెపుడి

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సింగ్ గీతం జర్నీ ఎలా మొదలైయింది? -ఇంతకుముందు నేను జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ…

Read more
‘ఇరుముడి’ గ్లింప్స్ జూన్ 3న రిలీజ్ Telugu News

‘ఇరుముడి’ గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందిస్తూ, రవితేజను కొత్త కోణంలో చూపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ మనసుని తాకేలా ఉంది. ఓ కొండపై కూర్చుని దూరాన్ని వీక్షిస్తున్న హీరో, అతని…

Read more
‘పెద్ది’ సినిమా నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది: రామ్ చరణ్ Telugu News

‘పెద్ది’ సినిమా నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం విజయవాడలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా అత్యద్భుతంగా జరిగింది. ఏఆర్ రెహ్మాన్ లైవ్…

Read more
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’ Telugu News

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

▪️ భానుచందర్, సునీత, సీ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల ▪️ ఆకాష్–భైరవి జోడీతో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు…

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్ Telugu News

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

* ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా (LADIA) సంస్థ ఖమ్మంలో తన ఏడో స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో, వినూత్నత, విశ్వసనీయత మరియు కస్టమర్-ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్న లాడియా, ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. ఖమ్మంలోని ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ నటి నేహా శెట్టి అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ, “ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారత్ విశేష పురోగతి సాధించింది. ఈ రంగంలో మరిన్ని వినూత్న ఆలోచనలను అందిస్తూ ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి లాడియా కట్టుబడి ఉంది. తెలంగాణలోని…

Read more
ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ Telugu News

ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌

దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు "వేదవ్యాస్" సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ సభ్యులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అధ్యక్షులు ప్రభు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటి ఎస్‌.వి.కృష్ణారెడ్డికి బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జనార్దన్, అబ్దుల్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీమతి…

Read more
‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్‌ Telugu News

‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్‌

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” జూన్ 5న భారతదేశంలో ఘనంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర స్కెలెటర్‌కు హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ వాయిస్ అందిస్తుండగా, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గాత్రాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ, “హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో నాకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. స్కెలెటర్ వంటి ఐకానిక్ విలన్‌కు మూడు భాషల్లో డబ్బింగ్…

Read more
ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు Telugu News

ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

- 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు - ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా "వేదవ్యాస్" మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా "వేదవ్యాస్" రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా...కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్…

Read more
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ Telugu News

మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు.. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ…

Read more
శృతి హాసన్ లాంచ్ చేసిన ‘సింగ్ గీతం’ నుంచి ‘ఏమైంది’ సాంగ్ రిలీజ్ Telugu News

శృతి హాసన్ లాంచ్ చేసిన ‘సింగ్ గీతం’ నుంచి ‘ఏమైంది’ సాంగ్ రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు. ‘ఏమైంది’ పాట ఓ మ్యూజికల్ పజిల్‌లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు…

Read more