కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను: సునీల్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న భారీ పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్ పాటలకు…
