కూకట్పల్లిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరైన సాయి దుర్గా తేజ్
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కూకట్పల్లిలోని గోపాల్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో పాల్గొని, అక్కడికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో కలిసి సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన…
