Skip to content
విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి Telugu News

విరాళాలపై అప్రమత్తంగా ఉండాలి

‘‘కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్‌ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌ కు సంబంధం లేదు. వీటిని ఆయన ఏ విధంగానూ ఆమోదించడం లేదని అధికారికంగా స్పష్టం చేస్తున్నాం. ఎన్టీఆర్‌, ఆయన ఆఫీస్‌తో సంబంధం ఉన్నట్లుగా చెబుతూ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాం. ఎలాంటి ప్రకటనలైనా, సామాజిక కార్యక్రమాలైనా.. వాటి వివరాలు నేరుగా ఎన్టీఆర్‌ నుంచే వెల్లడి అవుతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు ’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Read more
రుత్విక్ కి సినిమా అంటే చాలా పాషన్  :  డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News

రుత్విక్ కి సినిమా అంటే చాలా పాషన్: డైరెక్టర్ నాగ్ అశ్విన్

'రాజా ది రాజా'చాలా పాషన్ తో చేసిన సినిమా. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను: హీరో రుత్విక్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేసి, రుత్విక్, అనిల్ బోయిడపు, వృందావన్ క్రియేషన్స్ 'రాజా ది రాజా' ఎంటర్టైనింగ్ టీజర్ మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు…

Read more
అనిల్ రావిపూడి లాంచ్ చేసిన  ‘శ్రీనివాస మంగాపురం’లోని మంగా మంగా సాంగ్ Telugu News

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’లోని మంగా మంగా సాంగ్

‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆయన ఆ అంచనాలకు తగ్గట్టుగానే తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘అలెల్లే అలెల్లే’…

Read more
‘పెద్ది’ గ్రాండ్ పాన్ ఇండియా ప్రమోషన్స్‌ Telugu News

‘పెద్ది’ గ్రాండ్ పాన్ ఇండియా ప్రమోషన్స్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఇప్పుడు ఆ ఎక్సయిట్మెంట్ మరింత పెంచుతూ ముంబై, భోపాల్ నగరాల్లో రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు…

Read more
‘హ్యాపీ జర్నీ’  ఫస్ట్ లుక్‌ రిలీజ్ Telugu News

‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్‌ రిలీజ్

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత . ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం చేస్తోంది. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు…

Read more
విజయ్, రశ్మిక ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ పైగా లైక్స్ Telugu News

విజయ్, రశ్మిక ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ పైగా లైక్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్ స్టాగ్రామ్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. విరోష్ జోడి ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9.1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యాడ్ కు వరల్డ్ వైడ్ గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడం గమనార్హం. ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ పోస్ట్ కూడా విరోష్ చేసిందే కావడం విశేషం. వీరి వెడ్డింగ్ టైమ్ లో ఎండార్స్ చేసిన మాన్యవార్ యాడ్ 11.5 మిలియన్…

Read more
ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలకు ఇద్దరి మధ్య కోల్డ్ వారే కారణం: నట్టి కుమార్ Telugu News

ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలకు ఇద్దరి మధ్య కోల్డ్ వారే కారణం: నట్టి కుమార్

ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్...ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్స్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. సమస్యను ఎప్పుడైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన…

Read more
సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు Telugu News

సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు

ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ…

Read more
జూన్ 19న   ‘మా ఇంటి బంగారం’ Telugu News

జూన్ 19న ‘మా ఇంటి బంగారం’

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మా ఇంటి బంగారం’ టీజర్ ఇప్పటికే అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది. ‘తస్సాదియ్యా’ అనే పాట కూడా యూట్యూబ్‌ని షేక్ చేసేస్తోంది. మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సమంత చీరకట్టులో ఆ గన్ను పట్టుకున్న తీరు, ఆ చూస్తున్న చూపులు అదిరిపోయాయి. వేటకు వెళ్తున్న సివంగిలా సమంత లుక్…

Read more
“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు బ్రేక్ వస్తుంది :  వివి వినాయక్ Telugu News

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు బ్రేక్ వస్తుంది : వివి వినాయక్

ప్రణవ స్వరూప్ రచన దర్శకత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందు, అవికా గోర్ జంటగా మే 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న చిత్రం అగ్లీ స్టోరీ. శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగతాన్ని అందించగా శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చేశారు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర విడుదల తేది దగ్గరవుతున్న సమయంలో అగ్ర దర్శకులు వివి వినాయక్ గారు ఈ చిత్ర టైలర్ చూసి బృందానికి తన ఆశీస్సులను తెలిపి అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా దర్శకులు వివి వినాయక్ గారు మాట్లాడుతూ... "కాకినాడలో ఒక థియేటర్ యజమాని ప్రణవ స్వరూప్ కుటుంబానికి మా కుటుంబంతో ఎంతో కాలంగా…

Read more