Skip to content

పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి…

Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన భరత్ భూషణ్

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోని కీలక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో కలిసి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి చెందే విధంగా, ముఖ్యంగా సినిమా షూటింగులు గురించి ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన షూటింగులు, వాటి పర్మిషన్లు త్వరగా అందేలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో…

Read more

‘పళ్ళ బురుసు’ చిత్రం ట్రైలర్ విడుదల

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం 'పళ్ళ బురుసు'. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌ను డిజిటల్ విడుదలకు ముందే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కింగ్ అక్కినేని నాగార్జున లచ్చపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.…

Read more

కొరియన్ కనకరాజు’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది : ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే…

Read more

సినిమా బాగుంటే ఆదరిస్తారని ‘డిసి’ మరోసారి నిరూపించింది : నిర్మాత సురేష్ బాబు

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.."అందరికీ నమస్కారం. 'డీసీ' సినిమాకు వస్తున్న రిపోర్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారు, మేమంతా కలిసి…

Read more

‘హాయ్’ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, కవిన్‌తో పాటు కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందించగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ…

Read more

శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఇన్వెస్టిచర్‌ సెర్మొనీ(అధికార బాధ్యతల స్వీకార వేడుక) ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుక చేపట్టారు. ఈ కార్యక్రమానికి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘విద్యార్థులు నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలి’’ అని తెలిపారు. ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి’’ అని సూచించారు. మెహిదీపట్నం జోన్‌ ఆర్‌ఐ ఎన్‌.స్వాతి గౌరవ అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాధ్యతలను సమర్థవంతంగా…

Read more

‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో ఒకటిగా ఈ చిత్రం నిలవనుంది. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. స్టైల్, హాస్యం, ప్రేమ,…

Read more

“ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను” – ‘దందా’ ఫేమ్ దొర సాయి తేజ

వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలో హీరో దొరసాయి తేజ తన జర్నీ గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. మీ సినీ జర్నీ గురించి చెప్పండి? ప్రభాస్ గారి ‘అడవి రాముడు’ సినిమాలో హీరో చిన్నప్పటి చైల్డ్‌ కారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘కొత్తబంగారులోకం’, ‘హై స్కూల్’ అనే సిరీస్‌లో నటించాను. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ ఓ చిన్న పాత్రను పోషించాను. 2016 నుంచి ఆర్జీవీ గారి అనుబంధం…

Read more

‘కొరియన్ కనకరాజు’ మూవీ రివ్యూ: వరుణ్ తేజ్ ఖాతాలో హిట్..

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ (Korean Kanakaraju Review in Telugu): వరుణ్ తేజ్ హీరోగా, రీతికా నాయక్ హీరోయిన్‌గా తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సత్య, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ కొరియాతో ముడిపడిన ఓ ఆసక్తికరమైన సంఘటన కారణంగా హీరో జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి అనంతపురం వరకు సాగే ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, వాటి వల్ల ఏర్పడే సమస్యలు, వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో…

Read more