Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ చూసి మహేష్ బాబు గారు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు: హీరో జై కృష్ణ ఘట్టమనేని

అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి 'శ్రీనివాస మంగాపురం' లవ్, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న…

Read more

“రణబాలి” సినిమా సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ వర్కింగ్ స్టిల్ షేర్ చేసిన హీరోయిన్ రశ్మిక మందన్న

-"రణబాలి" చిత్రాన్ని తెరపై చూసేందుకు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నానంటూ రశ్మిక ఇన్ స్టా పోస్ట్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని…

Read more

హీరో ప్రియదర్శి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు రాబోతున్న మూవీ “ఇడుపు కాయితం”

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. "ఇడుపు కాయితం" సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో…

Read more

రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వ‌ద్ద హిస్ట‌రీ క్రియేట్ చేసిన స‌మంత‌

రీసెంట్‌గా సమంత ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. భారతీయ సినిమా చరిత్రలోనే రూపొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఈ చిత్రం తన బడ్జెట్‌పై 300 శాతం పైగా రికవరీ సాధించడం విశేషం. తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్ దాటి…

Read more

హీరో న‌వీన్ చంద్ర చేతుల మీదుగా “ఓరి నాయనో” మూవీ టైటిల్ లాంచ్

హైదరాబాద్: తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్ట‌ర్ గొండి మణితేజ తెర‌కెక్కిస్తున్న “ఓరి నాయనో” - (Tag line: Every life will have Ori..Nayano! Moment) సినిమా టైటిల్‌తో పాటు, సినిమా కార్యాల‌యాన్ని ముఖ్య అతిథి హీరో న‌వీన్ చంద్ర ఆవిష్క‌రించారు. మాదాపూర్‌లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 'మా ఊరి పొలిమెర' డైరెక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్, న‌టులు స‌త్యం రాజేష్, రాజా ర‌వింద్ర‌, డీవోపీ వెట్రి ప‌ళ‌నిస్వామితో పాటు, చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, “ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన పూజా…

Read more

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం..

శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ…

Read more

లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి అమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. – నందమూరి బాలకృష్ణ

తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు.. నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి! 🙏🏻

Read more

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు... ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో…

Read more

మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత కింగ్ నాగార్జున

‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో *నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’…

Read more

‘హ్యాపీ జర్నీ’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ ‘ఆనందమే’ రిలీజ్

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు 'ఆనందమే'…

Read more