Skip to content
కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను: సునీల్ Telugu News

కాటాలన్ లో ఇప్పటివరకు నేను చేయని ఒక విభిన్నమైన పాత్రను పోషించాను: సునీల్

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ మే 28న భారీ పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు విడుదలైన టీజర్‌ పాటలకు…

Read more
‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్ Telugu News

‘వదలా’ నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ ‘ఆ నింగీ ఈ నేల’ సాంగ్ రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, థ్రిల్లింగ్ టీజర్‌ , టైటిల్ ట్రాక్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర బృందం ‘ఆ నింగీ ఈ నేల’ అనే అందమైన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ మెలోడీని విడుదల చేసింది. మనసును హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ పాట కుటుంబ అనుబంధాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది. కృష్ణవేణి మల్లవజ్జల అందించిన…

Read more
150 మిలియన్+ వ్యూస్ తో ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్ Telugu News

150 మిలియన్+ వ్యూస్ తో ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ ‘ఆయా షేర్’ సాంగ్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో భారీ విజయాన్ని అందుకున్న 'దసరా' తర్వాత తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్ర సంగీత ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తొలి సింగిల్ ‘ఆయా షేర్’ విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌లోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ సాధించి నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియా, కాలేజ్ ఫెస్ట్స్, పబ్లిక్ ఈవెంట్స్, డ్యాన్స్ స్టేజీలను షేక్ చేస్తూ ఈ పాట ఒక కల్చరల్ ఫెనామెనన్‌గా మారింది. శ్రీకాంత్ ఓదెల…

Read more
ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ Telugu News

ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్వగ్రామమైన వేదురుపాకను సందర్శించి, ఈ చిత్రాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలు, భావోద్వేగాలు, జాతర సంబరాలలో భాగమయ్యారు. జాతర వేడుకల సందర్భంగా తన స్వగ్రామంలో ఇంటిని సందర్శించిన దేవిశ్రీ ప్రసాద్ గ్రామస్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వేడుకల ఉత్సాహంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా అక్కడి జ్ఞాపకాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే మనుసుని హత్తుకునే వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “మా నాన్నగారు జన్మించిన ఊరు వేదురుపాక. చిన్నప్పటి నుంచి ప్రకృతి, గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఎక్స్ పీరియన్స్ చేయాలని చెన్నై నుంచి తరచూ మమ్మల్ని ఇక్కడికి…

Read more
హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ Telugu News

హర్షిత్ రెడ్డి “దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...' ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు. 'తెల్లపోరి...' పాటను…

Read more
పెద్దిలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తారు: డీవోపీ రత్నవేలు Telugu News

పెద్దిలో రామ్ చరణ్ గారి నట విశ్వరూపం చూస్తారు: డీవోపీ రత్నవేలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు, విజువలైజేషన్ ఎలా ఉండింది? -బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది…

Read more
చిన్నారి నక్షిత వైద్యం కోసం అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ Telugu News

చిన్నారి నక్షిత వైద్యం కోసం అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది. నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న AAFA కార్యాలయం, ఆమె వైద్యం మరియు వైద్య ఖర్చుల కోసం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించింది. AAFA సభ్యులు మాట్లాడుతూ, సంఘ సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు.

Read more
శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ Telugu News

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.

Read more
మే 29న  “నేనెవరు?” గ్రాండ్ రిలీజ్‌ Telugu News

మే 29న “నేనెవరు?” గ్రాండ్ రిలీజ్‌

“నువ్వేకావాలి”, “ప్రేమించు” వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ ప్రతిభాశాలి చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన సందేశభరిత వినోదాత్మక చిత్రం “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలను కలగలిపి రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో సాయికిరణ్, జోగిని శ్యామల తమ అనుభవంతో కూడిన ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు…

Read more
మాతృదేవోభవ ఆశ్రమాన్ని సందర్శించి మానవత్వం చాటిన మనోజ్ మంచు Telugu News

మాతృదేవోభవ ఆశ్రమాన్ని సందర్శించి మానవత్వం చాటిన మనోజ్ మంచు

‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’లో భాగంగా రా కింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్‌కు హెయిర్ కట్ చేయడమే కాకుండా.. కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్‌ని సాధారణ మనిషిలా మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతడిని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి "సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు, సంతోష్ భాయ్" అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ .. ‘మాతృదేవోభవ అనాధ ఆశ్రమం…

Read more