కాలి గాయంపై స్పందించిన రశ్మిక మందన్న.. గాయాలు చికాకు తెప్పిస్తాయని ఇన్ స్టా పోస్ట్
ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు రశ్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో రశ్మిక మందన్న స్పందిస్తూ - గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు…
