Skip to content

‘అతడు’ 4K ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రీ–రిలీజ్‌

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ ‘అతడు’ మరోసారి గ్రాండ్‌గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో థియేటర్లలో రీ–రిలీజ్‌ కానుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. వెటరన్ నటుడు–నిర్మాత మురళీ మోహన్ ప్రతిష్టాత్మకంగా జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌, తివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌, క్లాస్ మేకింగ్‌, అద్భుతమైన పాటలు, మర్చిపోలేని యాక్షన్ తో అతడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
ఇప్పుడు సూపర్ 4K లో, డాల్బీ ఆడియోతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
థియేటర్ లిస్ట్స్‌, బుకింగ్ డీటెయిల్స్‌ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ ఐకానిక్ క్లాసిక్‌ని బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా ఎక్సపీరియన్స్ చేయడానికి ఆడియన్స్… గెట్ రెడీ.