టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు…
తిరుమలలో ఘనంగా జరిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య వివాహం


ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర తిరుమలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య వివాహ బంధంలో అడుగుపెట్టారు. కర్ణాటక భవన్లో జరిగిన ఈ వేడుక సంప్రదాయం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో ఓ అద్భుతమైన వేడుకగా నిలిచింది.
బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహ కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని అనుసరించి, అన్ని సంప్రదాయ క్రతువులతో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇరువురు కుటుంబ సభ్యులు ప్రతి ఆచారంలో పాల్గొంటూ ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఇది సంప్రదాయాల గౌరవం, ఆధునికత కలిసిన ఓ అందమైన వేడుకగా నిలిచింది.
వేదికను ఆలయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా అలంకరించారు. పూల అలంకరణలు, స్వర్ణ వర్ణ అలంకారాలు, సంప్రదాయ అలంకరణ కలిసి ఒక పవిత్రమైన దృశంగా నిలిచాయి. ఈ వేడుకలో సంప్రదాయాలకు ఇచ్చిన గౌరవం స్పష్టంగా కనిపించింది.
వధూవరుల కోసం ప్రత్యేకంగా డిజైనర్ శ్రవణ్ కుమార్ రూపొందించిన వస్త్రాలు వేడుకకు మరింత అందాన్ని తెచ్చాయి. కావ్య అందమైన పట్టు చీరలో, నాజూకైన ఆభరణాలతో మెరిశారు, సాయి శ్రీనివాస్ సంప్రదాయ వేషధారణలో క్లాసిక్గా కనిపించారు. వారి ఆనందం, అనుబంధం ప్రతి క్షణాన్ని మరింత మధురంగా మార్చింది.
సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం ఎంతో ఆత్మీయంగా సాగింది. ఆశీర్వాదాలు, సంప్రదాయాలు, వైభవం అన్నీ కలిసి ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా నిలిపాయి.
రేపు హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్నేహితులు, ఆత్మీయులు పాల్గొనే ఈ కార్యక్రమం మరింత వైభవంగా జరగనుంది. ఈ ఆనంద క్షణాలకు మరో అందమైన అధ్యాయంగా రిసెప్షన్ నిలవనుంది.
