మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు(మ్యాక్స్ విజన్ సౌజన్యంతో) నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యురాలు గౌతమి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్ చేయాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ఆర్ఐ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి, డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్చార్జ్ పల్లవి, కోఆర్డినేటర్స్ జైపాల్, జనార్ధన్, ఐపీఎల్ ఇన్చార్జ్ బాలరాజు, సి–బ్యాచ్ ఇన్చార్జ్ ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
