Skip to content

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు(మ్యాక్స్‌ విజన్‌ సౌజన్యంతో) నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యురాలు గౌతమి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్‌ చేయాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి, డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వైవిధ్యమైన ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు అరుణ, కీర్తిలతో పాటు పలువురు టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి.. క్రిస్మస్‌ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తోటివారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, ద్వేషంతో ఉండకూడదని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతాక్లాజ్‌, దేవధూత వేషధారణలతో, నృత్యాలు, నాటికలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ మేథమాటిక్స్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. విద్యార్థులు రామానుజన్‌ వేషధారణల్లో హాజరై, తమదైన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మేథమాటిక్స్‌ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి చేతులమీదుగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత హైదరాబాద్, డిసెంబర్: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత రూత్ ప్రభు చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివి శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయి ఇక్కడ అని తెలిపారు భారతీయ హస్తకళలు మరియు చేనేత శారీల ప్రాధాన్యతను ఆమె వివరించారు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. సిరిమల్లె…

Read more

దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది

తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి

Read more

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు యువకులు…

Read more

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025 – హేమలత రెడ్డి ప్రయాణం

హేమలత రెడ్డి ఒక ప్రతిభావంతమైన, బహుముఖ ప్రతిభ గల వ్యక్తిత్వం. ఆమె నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తరువాత ప్రొఫెషనల్ మోడలింగ్ మరియు బ్యూటీ పేజెంట్రీ రంగాలలోకి అడుగుపెట్టారు. ఆమె ప్రయాణం క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం మరియు నిరంతర కృషికి ప్రతీకగా నిలుస్తుంది. ఆమె జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని గర్వంగా ప్రతినిధ్యం వహిస్తూ Mrs India 2024 అనే ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సాధించారు. ఈ గ్లోబల్ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, మిసెస్ యూనివర్స్– ఇంటర్నేషనల్ గ్లోబాల్ క్వీన్ 2025 అనే అంతర్జాతీయ గౌరవాన్ని అందుకొని, తన ప్రతిభ, సౌందర్యం, సంస్కృతీ గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించినప్పటికీ, తన స్వస్థలంలో తనను తాను నిరూపించుకోవాలనే భావోద్వేగ…

Read more

కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్.. భారీగా పెరిగిన అంచనాలు!

టాలీవుడ్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ హైప్ క్రియేట్ చేస్తోంది. నెట్టింట New guy in town అనే హ్యాష్‌ట్యాగ్‌తో టీజ్ చేసిన ఈ ఇట్లు అర్జున ప్రాజెక్ట్, ఒక్క గ్లింప్స్ తోనే సస్పెన్స్ నింపింది. ఈ గ్లింప్స్ వీడియో నెటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇట్లు అర్జున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అనీష్‌ను లాంచ్ చేస్తూ మహేశ్ ఉప్పల మొదటిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు.. ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్స్ అందించిన వెంకీ కుడుముల ఈసారి నిర్మాతగా మారి What Next Entertainments బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో ఈ…

Read more

ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్తానం

'సోగ్గాడు' స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో మురళీమోహన్ నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "నాకు తొలి అవకాశం ఇచ్చింది…

Read more