Skip to content

‘కిష్కింధపురి’ దద్దరిల్లిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

కిష్కింధపురితో సాయికి బిగ్ హిట్ రావాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ అనిల్ రావిపూడి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులు హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు,…

Read more

ప్రజల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా” యాప్

రోగుల‌కు ఉచితంగా ఓపీ సేవ‌లు అందించేందుకు కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్ ల‌క్డీక‌పూల్ లోని FTCCI కేఎల్ ఎన్ ఆడిటోరియంలో ఈ నెల 15 న ఈ-ఆశా ఓపీ యాప్ ను సెల‌బ్రిటీలు లాంచ్ చేయ‌నున్న‌ట్లు సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు నాయకంటి పృథ్వీరాజ్ తెలిపారు .ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వంద‌కు పైగా హాస్పిట‌ల్స్ తో ఒప్పందం చేసుకున్నామ‌ని... పేషంట్ల‌కు ఎలాంటి ఫీజుల లేకుండా సేవ‌లు అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు .ఈ యాప్ ద్వారా ఓపీ బుక్ చేసుకున్న రోగుల‌కు త‌క్కువ స‌మ‌యంలో వైద్యులను క‌లిసి చికిత్స‌లు చేయించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు డెవలపర్స్ టీం లీడ్ వైష్ణ‌వి తెలిపారు . రోగుల కోసం ఉచితంగా ఓపీ సేవలు – ఈ నెల 15న ప్రారంభం కానున్న “ఈ-ఆశా”…

Read more

హైదరాబాద్‌లో దుల్కర్ సల్మాన్ చిత్రం షూటింగ్

వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నెలకుదిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా హెగ్డేను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పూజ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు చూపించే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పూజ స్కూటీ నడుపుతూ, దుల్కర్…

Read more

విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్

విజయవాడ: ప్ర‌ముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) విజయవాడలో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్‌నగర్ బ్యాంకు కాలనీలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ…

Read more

చందూ మొండేటి దర్శకత్వంలో వాయుపుత్ర

2026 దసరాకు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచేయడానికి వస్తున్న 3D యానిమేషన్ చిత్రం 'వాయుపుత్ర' మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు.. తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం రూపొందుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రం.. చరిత్ర, భక్తి,…

Read more

కిష్కింధపురి అదిరిపోతుంది: బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఫస్ట్ టై హారర్ సినిమా చేయడం ఎలా అనిపించింది? -నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం. -డైరెక్టర్…

Read more

మిరాయ్ విజువల్ వండర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: రితికా నాయక్

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రితికా నాయక్ విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు? -నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి…

Read more

ఆహా’లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో చేస్తుండటం గర్వంగా ఉంది – సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ టాలెంట్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు. ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సింగర్ సమీరా…

Read more

THE LUCK” సామాన్యుడి గేమ్ షో – 10 లక్షల రూపాయలు కారు బహుమానం

దేశంలోనే సామాన్యుల కోసం తొలి అతిపెద్ద రియాలిటీ షోగా రానున్న "ది లక్" - గెలిచిన వారికి 10 లక్షల రూపాయలు కారు రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకు ఎంతో మక్కువ కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం చేయనుంది. ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలెబ్రిటీలను, అలాగే ఇతర రంగాలలో ప్రముఖులను షోలో బాగంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండేవిధంగా ది లక్ అనే రియాలిటీ షో ఉండబోతుంది…

Read more

ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ గారు

ప్రముఖ సినీ నటుడు మరియు శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులకు స్ఫూర్తిని అందించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు మరియు సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. బాలకృష్ణ గారి సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఆయన ప్రోత్సాహకరమైన సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి…

Read more