Skip to content
చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం Telugu News

చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం

కలికిరి టౌన్: 03మే2026: కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని స్టేట్ బ్యాంక్ ముందు హైదరాబాద్ నగరం, డాలర్ డ్రీమ్స్ కాలనీ, ప్రగతి నగర్ కు చెందిన నరసయ్య కుమారుడు తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ కె.రాజేంద్ర (60)ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను గుండ్లూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మంచి స్నేహితుడు. ఇతను వారం రోజుల క్రితం కలికిరికి స్నేహితుని రూముకు వచ్చి ఉన్నాడు. అయితే శ్రీనివాసరెడ్డి ఒక రోజు ముందు హైదరాబాద్ కు వెళ్ళిపోగా రాజేంద్ర అతని రూమ్ లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ఆస్పత్రిలో ఈసీజీ తీసుకుందామని క్రాస్ రోడ్ స్టేట్ బ్యాంకు…

Read more
*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)* Telugu News

*ప్రెస్ నోట్ (సంక్షిప్త వెర్షన్ – 150 words)*

*హైదరాబాద్, తెలంగాణ:** తెలంగాణకు చెందిన స్టార్టప్ **cognitivescore.ai**, వ్యవస్థాపకులు **కీర్తి కుమార్ జైన్** మరియు **విక్రమ్ సింగ్ నేగి**, సంప్రదాయ మార్కుల ఆధారిత మూల్యాంకనాన్ని మించి విద్యార్థుల మేధస్సును గుర్తించడానికి **CogniCHAMP India Scholarship – Telangana Edition** ను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ **3 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు** అందుబాటులో ఉంటుంది. పరీక్ష **2026 మే 2 లేదా 3 తేదీల్లో** 20 నిమిషాల **ఆన్‌లైన్ గేమిఫైడ్ అసెస్‌మెంట్** రూపంలో నిర్వహించబడుతుంది. విద్యార్థులు ఎక్కడి నుండైనా, ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు. **రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 26, 2026.** ఈ ప్రోగ్రామ్‌లో **Cognitive Quotient (CQ), Higher-Order Thinking, Foundational Literacy and Numeracy (FLN)**…

Read more
WhatsApp Image 2026-04-04 at 8.39.51 PM

అయ్యన్నకు మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు

జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి డాక్టర్ సుధాకర్ గారి మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయం తో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి

Read more
ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌ Telugu News

ఘనంగా సైన్స్‌ ఫెయిర్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో నేషనల్‌ సైన్స్‌ డేని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ప్రాజెక్టులను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. వాటిని బి. కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాల డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, ప్రీ ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పుష్ప, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత, కంటి వైద్య శిబిరం

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత, కంటి వైద్య శిబిరాలు(మ్యాక్స్‌ విజన్‌ సౌజన్యంతో) నిర్వహించారు. ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి వైద్యురాలు గౌతమి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం, యోగా, వాకింగ్‌ చేయాలి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి, డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ జైపాల్, జనార్ధన్, ఐపీఎల్‌ ఇన్‌చార్జ్‌ బాలరాజు, సి–బ్యాచ్‌ ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌ Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం హ్యాపీ క్లబ్‌ ప్రోగ్రామ్‌ని ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వైవిధ్యమైన ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు అరుణ, కీర్తిలతో పాటు పలువురు టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి.. క్రిస్మస్‌ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తోటివారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, ద్వేషంతో ఉండకూడదని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతాక్లాజ్‌, దేవధూత వేషధారణలతో, నృత్యాలు, నాటికలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more
మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే Telugu News

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ మేథమాటిక్స్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. విద్యార్థులు రామానుజన్‌ వేషధారణల్లో హాజరై, తమదైన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మేథమాటిక్స్‌ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి చేతులమీదుగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read more
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత Telugu News

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ షోరూమ్‌ను ప్రారంభించిన హీరోయిన్ సమంత హైదరాబాద్, డిసెంబర్: టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఫ్యాషన్ ప్రియులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు సమంత అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత రూత్ ప్రభు చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు వంటివి శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయి ఇక్కడ అని తెలిపారు భారతీయ హస్తకళలు మరియు చేనేత శారీల ప్రాధాన్యతను ఆమె వివరించారు భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని తెలిపారు. సిరిమల్లె…

Read more
దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది Telugu News

దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది

తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి

Read more